Breaking : కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్టు నుండి విమాన సర్వీసుల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే,. ఈ రోజు తొలి విమానం బెంగళూరు నుండి కర్నూలుకు చేరుకుంది. 52 మంది ప్రయాణీకులు ఈ విమానంలో చేరుకున్నారు.
10.10 గంటలకు మొదటి విమానం బెంగళూరు నుండి కర్నూలుకు చేరుకోగా ఉదయం 10.30 గంటలకు కర్నూలు నుండి విమానం విశాఖకు బయలుదేరింది. కర్నూలు నుండి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సేవలు నడపనున్నాయి. విమానాల రాకపోకలతో సందడి నెలకొంది. విమాన సర్వీసుల ప్రారంభంతో కర్నూలు జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.