బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు గా టిడిపి నాయకురాలు మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో మూడు రోజులు కస్టడీలో ఉన్న అఖిల ప్రియ తెలంగాణ పోలీసులు దాదాపు 300కు పైగా ప్రశ్నలు వేసినట్లు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసిందే. కాగా బుధవారంతో కస్టడీ ముగియడంతో.. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోగా సంక్రాంతి సందర్భంగా కోర్టు సెలవు కావడంతో.. న్యాయమూర్తి నివాసం వద్ద విచారణ చేసి శనివారానికి వాయిదా వేయటం అందరికీ తెలిసిందే.
కాగా తాజాగా మరోసారి బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోగా…. వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసినట్లు సమాచారం. బోయినపల్లి ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఇంకా కొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా ఈ కేసులో భార్గవ్రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్లకు కూడా సంబంధం ఉన్నట్లు..విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ కేసులో అఖిలప్రియ తోపాటు అరెస్టయిన సంపత్కుమార్, మల్లికార్జునరెడ్డి, బాలచెన్నయ్యలను కూడా కస్టడీకి తీసుకునే రీతిలో కోర్టులో పోలీసులు పిటిషన్ వేయటానికి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.