Breaking : దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభించిన విషయం తెలిసిందే. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదు అయిన చోట లాక్ డౌన్ విధించారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఒంటిపూట బడులు కూడా జరపవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
ఇక మాస్క్ తప్పనిసరి అని…. లేని పరిస్థితుల్లో జరిమానా విధిస్తారు అని కూడా తెలిపింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలన్నీ మూసి వేయవలసిందిగా ఆర్డర్ వేసింది. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తమిళనాడు ప్రభుత్వం దీని వైపు మొగ్గు చూపారు. ఈ రాష్ట్రాన్ని చూసి పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కూడా ఇలాగే త్వరలోనే కాలేజీలు మూసివేయవచ్చు అని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?