కేంద్ర హోమ్ మంత్రి… భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అమిత్ షా కి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అతను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే అతనికి కరోనా వ్యాధి నయం అయిపోయిన నేపథ్యంలో అతను మళ్లీ ఆస్పత్రికి వెళ్లడం చర్చగా మారింది.
ఇకపోతే కేవలం చిన్న చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారని తెలుస్తోంది. ఇక ఈరోజు ఉదయం 7:00 గంటలకు షా డిశ్చార్జి అయ్యాడని అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. మీడియాకు ఇచ్చిన ఈ ప్రకటనలో అమిత్ షా పూర్తిగా కోలుకున్నారని ఇక అతను తన బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైపోయాడని తెలిపారు.
కోవిడ్ టెస్టులో నెగటివ్ వచ్చినా…. ప్రోటోకాల్ ప్రకారం కొద్దిరోజులు ఇంటిలోనే ఉండి చివరికి ఆస్పత్రికి వెళ్లి తనకు ఎలాంటి ప్రమాదం లేదని అమిత్ షా ధ్రువీకరించుకోవడం గమనార్హం.