Breaking: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఏపీ సీఐడీ నేడు నోటీసులు జారీ చేసింది. గతంలో రాజద్రోహం తదితర సెక్షన్ల కింద రఘురామను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామను విచారణకు గానూ ఈ నెల 17వ తేదీన సీఐడీ కార్యాలయానికి హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రఘురామ ఇంటికి కొద్ది సేపటి క్రితం సీఐడీ అధికారులు చేరుకుని నోటీసులు జారీ చేశారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ గత కేసులపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని చెప్పారు. నర్సాపురం వస్తున్నాననీ కావున తగిన భద్రత కల్పించాలని జిల్లా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చాననీ తెలిపారు.
ఈ నెల 13 లేదా 17న విచారణ హజరుకావాలని కోరారనీ, ఇన్నాళ్లూ అడగకుండా పండుగ రోజుల్లోనే నోటీసులు ఇచ్చారని విమర్శించారు. సంక్రాంతి హిందువులకు ముఖ్యమైన పండుగ అని, సీఐడీ సునీల్ కు, సీఎం జగన్ కు సంక్రాంతి ప్రాశస్త్యం తెలిసి ఉండకపోవచ్చనీ అందుకే 13వ తేదీ హజరుకావాలని నోటీసు ఇచ్చినట్లు ఉందన్నారు. ఈ రోజు నోటీసు ఇచ్చి రేపు రావాలంటే ఎలా అని రఘురామ తరపు న్యాయవాది ప్రశ్నించారు. 17వ తేదీ విచారణకు తప్పకుండా హజరు అవుతానని రఘురామ తెలిపారు. ఇదే సందర్భంలో రఘురామ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పై విమర్శలు గుప్పించారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకూ వైసీపీకి అవకాశం ఇచ్చాననీ, తన పై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు నమోదు చేస్తారా అంటూ రఘురామ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?