BREAKING : ఏపీ ఎంసెట్ 2021 రిజల్ట్స్ ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్నాయి. ఎంసెట్ ఫలితాలు రేపు అనగా సెప్టెంబర్ 8 ఉదయం 10:30 గంటలకు రిలీజ్ కానున్నాయి. APSCHE తరఫున AP EAPCET నిర్వహించే జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ రేపు ఫలితాలతో పాటు ర్యాంక్ లిస్టును సైతం విడుదల చేయనుందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ (EAPCET) టెస్ట్ ఫలితాలు sche.ap.gov.in/EAPCET లో విడుదల అవుతాయి. రేపు ఆన్లైన్ మోడ్లో ఫలితాలు విడుదల అవుతాయి. కానీ విద్యార్థుల ర్యాంక్ కార్డులు తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఎంసెట్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఫలితాలను రేపే వెల్లడిస్తున్నారు.