Breaking: ట్రెజరీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరై జీతాల బిల్లలను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రెజరీ ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండి తమ విధులు నిర్వహించాలని పేర్కొంది.
అంతకుముందే కొత్త పే స్కేల్ ప్రకారం తక్షణమే ఉద్యోగుల వేతనాలను ప్రాసెస్ చేయాలని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. బిల్లులు ప్రాసెస్ చేయని డి డి ఓ లు , ట్రెజరీ అధికారులపై చర్యలకు ఆశిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ మెమోలు జారీ చేశారు. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.