తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మరియు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం లో గత కొద్ది రోజుల క్రితమే అరెస్టయిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి వైద్యం అందిస్తున్నారు. అరెస్టుకు కొద్ది రోజులకు ముందు అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగింది.
అయితే ఇప్పుడు మళ్లీ అతనికి ఆ సమస్య తిరిగి పెట్టడంతో తీవ్రంగా రక్తస్రావం అవుతున్నట్లు వైద్యుల ఇటీవలే పేర్కొన్నారు. తాజాగా అతని ఆరోగ్యం పై అప్డేట్ వదిలిన వైద్యులు పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. అలాగే ఆయనకు రక్తపోటు కూడా ఎక్కువగా నమోదు అవుతుండటం గమనార్హం.
ప్రస్తుతానికి అచ్చెంనాయుడుకి అత్యవసర విభాగం లో చికిత్స అందిస్తున్నారు. ఇక ఎమర్జెన్సీ వార్డ్ నుండి అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లు జిజిహెచ్ హాస్పిటల్ ఉన్నతాధికారులు చెప్పారు. ఇకపోతే ముందు నుంచే అతని ఆరోగ్య పరిస్థితి పై తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా ఈ తాజా అప్డేట్ తో వారు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది.