BREAKING : ప్రముఖ న్యూస్ పేపర్, న్యూస్ మీడియా సంస్థ అయిన ఈనాడులో పని చేయాలంటే ఎంతో ప్రతిభతో పాటు ఓపిక కూడా ఉండాలి.
ఈనాడులో చేరిన చాలామంది 10-20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేయలేరని అంటుంటారు. కానీ ప్రతిభా సంపన్నుడు, వ్యంగ్య చిత్ర కారుడైన శ్రీధర్ రావు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఈనాడు పేపర్ లో మొదటి పేజీలో కార్నర్ లో ప్రచురించే అతని కార్టూన్లు సమకాలిన అంశాలపై సటైర్లు వేస్తూ ఎంతో మంది పాఠకులను ఆలోచింపజేశాయి.
అయితే ఈ గొప్ప కళాకారుడు ఈనాడుకు నాలుగు దశాబ్దాల తర్వాత వీడ్కోలు పలికారు. 40 ఏళ్ల తర్వాత ఈనాడు సంస్థకు రాజీనామా చేశానని శ్రీధర్ తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించారు.