Breaking: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు అయ్యింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రఘురామతో పాటు ఆయన తనయుడు, భద్రతా సిబ్బందిపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఏపికి చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుబానీ అలియాస్ ఫరూక్ బాషాపై దాడి చేశారన్న అభియోగంపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషాపై నిన్న రఘురామ భద్రతా సిబ్బంది దాడి చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అప్పగించిన సంగతి తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాను ఏపి కానిస్టేబుల్ ని అని చెబుతున్నా వినకుండా తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారంటూ బాషా పోలీసులకు వివరించారు. తన ఐడీ కార్డు, పర్సు కూడా లాక్కుకున్నారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్ తో పాటు సీఆర్పీఎఫ్ కు చెందిన ఎఎస్ఐ, కానిస్టేబుల్ సందీప్, రఘురామ పీఎ శాస్త్రిలపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో సదరు సీఆర్పీఎస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తొంది.