ఉన్నట్టుండి ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వారిని వణికించడం మొదలు పెట్టేసింది. నిన్నటి అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత సాయంత్రానికి చింతమనేని ని అదుపులోకి తీసుకోవడం మరియు ఈ రోజు ఉదయాన్నే జెసి ప్రభాకర్ రెడ్డి మరియు అతని కొడుకు అస్మిత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు పట్టుకొని వెళ్లడం చూస్తుంటే టిడిపి వర్గాల గుండెల్లో గుబులు మొదలైంది. ఇక వైసిపి మద్దతుదారులు అంతా ఇది బాబు కి సరైన గుణపాఠం అని సంబరపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నెంబర్ 2, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని వేసిన ట్వీట్ లో ఇప్పుడే చంద్రబాబు తన ప్రాణ మిత్రుడికి ఫోన్ చేసి లండన్ లో ఎలా దాక్కోవాలి అన్నట్లు మరియు ఇండియా నుండి విజయవంతంగా ఎలా తప్పించుకోవాలని సమాచారం అడిగినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
అలాగే చంద్రబాబు మిత్రుడిని బడా పారిశ్రామికవేత్త గా చెప్పిన విజయ్ సాయి రెడ్డి ఖచ్చితంగా అతను విజయ్ మాల్యా గురించే చెబుతున్నట్లు ప్రజానీకం భావిస్తోంది. మరి విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలకు బాబు ఎటువంటి రిప్లై ఇస్తాడో వేచి చూడాలి.