హైదరాబాద్ లోని నిజామాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో భారత్ బయోటెక్ వారి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఐసీఎంఆర్ సూచనమేరకు దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ వివిధ నగరాల్లోని హాస్పిటల్స్ లో ప్రారంభమయ్యాయి.
దీనిలో భాగంగా విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి తో పాటు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిని క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వాలంటీర్లకు కొద్దిసేపటి క్రితమే కోవ్యాక్సిన్ ను ఎక్కించడం జరిగింది.
ఇక వారి శరీరంలో చోటు చేసుకునే మార్పులు మరియు ఆ వ్యాక్సిన్ వైరస్ రో పోరాడే తీరుని బట్టి ఒక రిపోర్టు తయారు చేసిన అంతా ఆశాజనకంగా ఉన్న అనంతరం ఈ వ్యాక్సిన్ మార్కెట్ లోకి వస్తుంది. ఇదంతా విజయవంతం అయ్యేందుకు కనీసం తొమ్మిది నెలలు పడుతుందని ఇదివరకే భారత్ బయోటెక్ ప్రకటించింది.