BREAKING: ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ముందే భారీ షాక్ తగిలింది. ఐపిఎల్ కి కరోనా ఎఫెక్ట్ పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ కరోనా బారిన పడ్డాడు. దీంతో ఈరోజు మ్యాచ్ జరుగుతుందా, లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అందరు ఈ మ్యాచ్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే టి.నటరాజన్ తో పాటు అతడికి క్లోజ్ గా కాంటాక్ట్ అయిన ఆరుగురిని ఐసొలేషన్ కి పంపించినట్టు సమాచారం.
ఐసొలేషన్ లో ఉన్నవాళ్లు వీరే:
1. విజయ్ శంకర్ – ఆటగాడు
2. విజయ్ కుమార్ – టీమ్ మేనేజర్
3. శ్యామ్ సుందర్ జె – ఫిజియోథెరపిస్ట్
4. అంజనా వన్నన్ – డాక్టర్
5. తుషార్ ఖేడ్కర్ – లాజిస్టిక్స్ మేనేజర్
6. పెరియసామి గణేషన్ – నెట్ బౌలర్
BREAKING: అజిత్ “వలిమై” నుంచి లేటెస్ట్ న్యూస్ మీ కోసం …!
ఈరోజు రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా, లేదా అనేది మరికొద్ది గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
PELLI SANDADI TRAILER: పెళ్ళి సందడి ట్రైలర్ విడుదల …!