Breaking: టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును గురువారం అర్ధరాత్రి ఏపి సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అశోక్ బాబు అరెస్టు నేపథ్యంలో ఆయనను కలిసేందుకు శుక్రవారం ఉదయం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యరావు తదితరులు గుంటూరు సిఐడీ కార్యాలయం వద్దకు వెళ్లారు. సీఐడీ కార్యాలయంలోకి టీడీపీ నేతలకు అనుమతి లేదని నగరపాలెం పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల తీరుపై ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు అరెస్టు చేసి వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Breaking: సీఐడీ అధికారులపై ఉమా తీవ్ర ఆరోపణలు
ఈ సందర్భంలో దేవినేని ఉమా సీఐడీ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకువచ్చారని అన్నారు. ఆయనపై దాడి చేస్తారా, తప్పుడు కేసులతో వేధిస్తారా అంటూ ప్రశ్నించారు. గతంలో ఎంపి రఘురామ కృష్ణంరాజును కష్టడీలో కొట్టారనీ, ఇప్పుడు అశోక్ బాబుపైనా సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న అనుమానం తమకు ఉందని అన్నారు. అశోక్ బాబును తమకు చూపాలని డిమాండ్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?