Breaking ; చెక్ బౌండ్స్ కేసులో సినీ ప్రముఖులు రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో వారిపై నేరం నిరూపణ అయినందున కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.
శరత్ కుమార్, రాధిక గతంలో పలు సినిమాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ సమయంలో ఓ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం తీసుకున్నారు. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాలని సదరు సంస్థ ఒత్తిడి పెంచడంతో శరత్ కుమార్, రాధిక చెక్కు ఇచ్చారు. వారు ఇచ్చిన చెక్ బౌండ్స్ అవ్వడంతో సదరు సంస్థ వారిపై కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నై స్పెషల్ కోర్టు బుధవారం ఇద్దరికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇద్దరు సినీ ప్రముఖ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు రావడం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశమైంది.