Breaking: గ్యాస్ సిలెండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతు విధించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులు 9 కోట్ల మందికి గ్యాస్ సిలెండర్ కు (ఏడాదికి 12 సిలెండర్ ల వరకు) రూ.200లు సబ్సిడీని అందిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయం దేశంలోని ఎందరో మహిళలకు లబ్దికల్గిస్తుందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏడాదికి రూ.6100 కోట్ల భారం పడుతుందన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం గ్యాస్ వినియోగదారులకు రూ.200 సబ్సిడీ ప్రకటించడంతో పాటు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.