Breaking: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకి ముంబయి విమానాశ్రయంలో(airport) భారీ షాక్ తగిలింది. నవంబర్ 14న రాత్రి దుబాయ్ నుంచి వస్తుండగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు హార్దిక్ ని విమానాశ్రయంలోనే ఆపివేశారు. అతని నుంచి రూ.5 కోట్ల విలువైన రెండు వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం గురించి కస్టమ్స్ అధికారులు మీడియాకి తెలిపారు.
Bigg Boss 5 Telugu: నిరూపిస్తే కాళ్లు మొక్కుతా.. ఆ కంటెస్టెంట్ కి యానీ సవాల్..!!
టీ20 ప్రపంచకప్లో ఆడి స్వదేశానికి తిరిగి వస్తుండగా హార్దిక్ పాండ్యను కస్టమ్స్ అధికారులు ఆపారు. ఖరీదైన వాచ్ల (watches)ఇన్వాయిస్ను, బిల్లు రసీదును చూపించలేక పోవడంతో హార్దిక్ ని అధికారులు నిలిపివేశారు. అంతేకాదు రెండు వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 క్రికెట్ ప్రపంచకప్లో హార్దిక్ పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలయ్యారు. టీ20 క్రికెట్ ప్రపంచ కప్ 2021..(T20world cup) 3 ఇన్నింగ్స్లలో హార్దిక్ 69 పరుగులే చేశారు. ముఖ్యంగా న్యూజిలాండ్, పాకిస్థాన్తో జరిగిన కీలక మ్యాచ్ల్లో కీలక సమయాల్లో తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు.