Breaking: అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. ఉదయం నుండి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్రో రైల్ సర్వీసులను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తదుపరి సమాచారం ఇచ్చే వరకూ మూడు లైన్లలోని అన్ని మెట్రో రైళ్లను నడపబోమని తెలిపింది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరో పక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి అదుపులోకి రాలేదు. రైల్వే పట్టాలపై ఆందోళనకారులు బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్దతిలో ఆర్మీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టి, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు 11 రౌండ్ల కాల్పులు జరపగా ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ లో ఆందోళనతో ప్రయాణీకులు భయబ్రాంతులకు గురి అయ్యారు. రైళ్ల రద్దుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఘటనపై రైల్వే డివిజనల్ మేనేజర్ ఎకే గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఆందోళనకారులు నాలుగైదు ట్రైన్ ఇంజన్లు, రెండు మూడు కోచ్ లకు నిప్పు పెట్టారని చెప్పారు. జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తాత్కాలికంగా సర్వీసులను నిలుపుదల చేసినట్లు తెలిపారు.
Hyderabad | “Due to some disturbance in the city, all operations in all three lines of Hyderabad Metro Rail stand suspended till further notice," tweets L&T Metro Rail (Hyderabad) Limited
— ANI (@ANI) June 17, 2022