ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఆటలకు అంతమొందించే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకూ అది సంక్రమించకుండా అడ్డుపడే సరైన వ్యాక్సిన్ లేక లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఈ వైరస్ కు ఇప్పుడు చరమగీతం పాడే టైమ్ దగ్గరపడింది. ఇక దీనంతటికీ కారణం ఆగస్టు 15వ తేదీన భారతదేశం విడుదల చేయనున్న వ్యాక్సిన్.
అవును కరోనా వైరస్ ను నియంత్రించే మరియు మానవాళికి సంక్రమించకుండా అడ్డుపడే వ్యాక్సిన్ తయారీపై ఐసీఎంఆర్ స్పష్టత ఇచ్చేసింది. ప్రస్తుతం వారు తయారుచేసిన వ్యాక్సిన్ మానవుల పై ప్రయోగాల ఉందని మరియు ఎంతో ప్రోత్సాహక రిజల్ట్స్ వస్తున్నాయని కూడా తెలిపింది. ఆగస్టు 15 కల్లా ఇది అందుబాటులో ఉంటుందని ఐసీఎంఆర్ ఖచ్చితమైన ప్రకటన చేసింది.
మహా అంటే ఒక రెండు వారాలు అటు ఇటుగా లేట్ కావచ్చు ఏమో కానీ ఆగస్టు నెలలో మాత్రం కచ్చితంగా వ్యాక్సిన్ బయటకు వస్తుందని ఐసీఎంఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక వ్యాక్సిన్ వచ్చేస్తే అందుకు సంబంధించిన టీకాలు వేయించుకున్న వారెవరికీ కరోనా సోకే ప్రమాదం లేదు. కాబట్టి ఆ తర్వాత ఈ వైరస్ పూర్తిగా అంతమొండడం మనం చూడవచ్చు.