కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక సంచలన ప్రకటన చేశారు. స్వయంసమృద్ధి భారత్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 101 వస్తువుల దిగుమతిను బ్యాన్ చేసినట్లుగా ప్రకటించారు.
దీంతో చైనా దేశంతో సహా మిగతా అన్ని దేశాలకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఏ దేశానికైనా భారత దేశానికి ఎగుమతి చేస్తే అందులో వచ్చే లాభమే వేరే స్థాయిలో ఉంటుంది. అంతే భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు కి ఉపాధి కల్పించాలని ఆలోచనతో ‘స్వయంసమృద్ధి భారత్’ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
బిజెపి ప్రభుత్వం ఇప్పటికే చైనా వారికి సంబంధించిన పలు యాప్స్ ను బ్యాన్ చేసి, పలు ఒప్పందాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత దేశంలోకి దిగుమతి చేసేందుకు అనుమతి లేని ఆ 101 వస్తువుల లిస్ట్ ఏమిటో త్వరలోనే ప్రకటిస్తారు.