BREAKING: పారా ఒలింపిక్స్లో భారత్ హవా కొనసాగుతోంది. వరుస పతకాలతో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మరో మెడల్ ను భారత్ సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారతదేశం నుంచి అవనీ లేఖరా పోటీ పడింది. తన అద్భుత ఆటతీరుతో ఉరకలెత్తే ఉత్సాహంతో అవనీ పోటీలో పాల్గొంది. చివరికి విజయం సాధించింది. భారత్కు బంగారు పతకాన్ని సాధించి పెట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
BREAKING: తొలి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న భారత్…!
అవనీ లేఖరా గోల్డ్ మెడల్ సాధించడంతో యావత్ భారత దేశం విజయోత్సాహంతో ఉప్పొంగుతోంది. అవనీ లేఖరా ఆటతీరుకు భారతీయ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అవనీ గోల్డ్ మెడల్ సాధించగా చైనాకు చెందిన కుయ్పింగ్ ఝాంగ్ 248.9తో రజత పతకాన్ని గెలుచుకోగా ఉక్రెయిన్కి చెందిన ఇరినా షెత్నిక్ 227.5తో కాంస్య పతకం గెలుచుకున్నారు. పారాలంపిక్స్ లో భారతీయ క్రీడాకారులు ఇప్పటికే అద్భుత ఆటతీరుతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ రోజు కూడా అదే దూకుడుతో పోటీల్లో పాల్గొంటున్నారు.
CM Stalin: దేశానికి ఆదర్శంగా మారుతున్న స్టాలిన్..! సంచలన సాహస అడుగులు..!!