తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇటీవల కాలంలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారిత టెస్టులు ఆశించిన స్థాయిలో చేయని రోజులు అతి తక్కువ కేసులు నమోదు కాగా హైకోర్టు వారు ఎప్పుడైతే జరుగుతున్న టెస్టుల సంఖ్యను పెంచమని ఆదేశించారో…. అప్పటినుండి రోజుకి వందలకుపైగా టెస్టులు బయటపడుతున్నాయి.
దీంతో ఈ మధ్యకాలంలో కేసీఆర్ సర్కార్ పై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. ఇకపోతే టెన్త్ పరీక్షలు వ్యవహారం కూడా ప్రభుత్వం చేయి దాటిపోయింది అనే చెప్పాలి. హైకోర్టు వారు చెప్పినట్లు పరీక్షలు నిర్వహించడం కుదరని నేపథ్యంలో కెసిఆర్ పదవ తరగతి పరీక్షల పై ఆయన జరపనున్న ప్రెస్ మీట్ లో కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
గత ప్రెస్ మీట్ లలో కొంచెం శాంతంగా కనిపించిన కేసీఆర్ ఈసారి మాత్రం కొంచెం గరం గరం గానే ఉంటారు అని అంతా భావిస్తున్నారు. ఇక కరోనా ఉదృతి పెరిగిపోయిన సమయంలో లాక్ డౌన్ ఎత్తివేత జరుగగా తమ రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణపై కెసిఆర్ కీలకమైన విషయాలను వెల్లడిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.