కేంద్రీయ విద్యాలయ.. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 9 మరియు 11వ తరగతుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రమోట్ చేసేందుకు వారికి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
గతంలోనే ఈ రెండు క్లాసుల విద్యార్థులు రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇక సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయితేనే 9వ తరగతి విద్యార్థులకు పదవతరగతిలో పదకొండవ తరగతి విద్యార్థులకు 12వ తరగతి లోకి ఎంట్రీ ఉంటుంది.
కానీ ప్రస్తుత కరుణ వైరస్ సంక్షోభం కారణంగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడం సాధ్యం కాలేదు కాబట్టి వారిని ప్రమోట్ చేసేందుకు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలని కేంద్ర విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇక ఐదు సబ్జెక్టులూ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ తో పాటుగా వచ్చిన మార్కుల ఆధారంగా తర్వాత క్లాస్ కు ప్రమోట్ చేస్తారు.