Breaking: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయని అందరూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటే మళ్లీ మరో గండం ముందుకొచ్చింది. కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే కేరళను హాట్ స్పాట్ గా గుర్తించారు. కేరళలో పండగలు రావడంతో జనం గుమికూడటం ఎక్కువైంది. దీంతో కరోనా కేసులు కూడా బాగా పెరిగాయి. గత మూడు రోజుల నుంచి తగ్గిన కరోనా కేసులు ఎట్టకేలకు పెరగడం ప్రారంభమైంది. కేసులు పెరుగుతున్నా కూడా ఆంక్షలను మాత్రం పెట్టకూడదని కేరళ కోవిడ్ రివ్యూ కమిటీ తెలిపింది.
Bad Cholesterol: కొవ్వు కరిగించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా..!? ఇవి తింటే కరుగుతుంది..
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఏకంగా 31445 కొత్త కేసులు రావడంతో కేరళలో ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 19.03 శాతం నమోదవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా కేసులు తగ్గడం కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ఇలా పండగ వాతావరణం నెలకొనడంతో కరోనా కేసులు పెరిగాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలను తీసుకోనుంది.
Breaking: విచారణకు రండి, డ్రగ్స్ కేసులో రకుల్, పూరీ, రవి తేజకి నోటిసులు జారీ..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?