BREAKING: మూడు రాజధానుల ప్రతిపాదనలో కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా పరిగణించిన విషయం విధితమే. అయితే ప్రస్తుతం జగన్ సర్కార్ కర్నూలు జిల్లాను జుడిషియల్ క్యాపిటల్ గా మార్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
AP YSRCP: ఏపీలో మరో సారి జగన్దే అధికారం..! ఇదీ లెక్క..!!
కాగా 2017లో హెచ్ఆర్సీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఉత్తర్వులలో సవరణలు చేస్తూ హెచ్ఆర్సీ కార్యాలయాన్ని కర్నూలు తరలిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ స్పష్టం చేసింది. లోకాయుక్త, ఉప లోకాయుక్తను కర్నూలుకు తరలిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే ప్రస్తుతంలో కాయుక్త, ఉపలోకాయుక్త ఆఫీసులు హైదరాబాద్ నగరం నుంచే పనిచేస్తున్నాయి. ఇకపై ఆ ఆఫీసులు కర్నూలు జిల్లాలో ఏర్పాటై అక్కడి నుంచే పనిచేస్తున్నాయి.
Vijaya Sai Reddy: విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి