Breaking: విశాఖ మారికవలసలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డనే ఓ తల్లి అతి కిరాతకంగా చంపేసి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని వరలక్ష్మి అనే మహిళ తన మూడేళ్ల బిడ్డను హత్య చేసింది. ఈ విషయం బయటికి పొక్కుకుండా ఉండేందుకు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా నిర్వహించింది.
అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విచారణ నిమిత్తం వరలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీస్ వాహనంలో తీసుకువెళుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసువచ్చి ఆమెను స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వరలక్ష్మి పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?