వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి ఈ రోజున పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎంపీ విజయసాయిరెడ్డి అధికార పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత జగన్ మరియు పార్టీ సభ్యులను విపరీతంగా విమర్శిస్తున్న రాజుగారికి ఎట్టకేలకు చెక్ పెట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
అయితే ఈ విషయంపై రాజుగారు స్పందిస్తూ ఏనాడూ తాను పార్టీని కానీ పార్టీ అధ్యక్షుడిని కానీ పల్లెత్తు మాట అనలేదని అన్నారు. ప్రజల కోసం చేపట్టిన పథకాలు సక్రమంగా జరగడం లేదని ముఖ్యమంత్రికి చెప్పాల్సిన విషయాలు మీడియా ముఖంగా వెల్లడించడం మాత్రమే జరిగిందని ఆయన అనడం గమనార్హం. ఇన్ని రోజులు సీఎం అప్పాయింట్మెంట్ దొరకలేదని చెప్పిన ఆయన వారం రోజుల్లో ఇవ్వాల్సిన వివరణను రేపే ఇస్తానని చెప్పారు.
ఇకపోతే ఎంపీ రాజు వైసీపీ ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం…. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడటం వంటి విషయాలపై పార్టీ అధినాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అతను వారం రోజుల్లోగా వీటికి సరైన సమాధానం ఇవ్వకపోతే అతనిని అతని పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ నోటీసులో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.