ఏపి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఆఖిల ప్రియను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అఖిలప్రియ వాహనంలోనే బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు.
అంతకు ముందే అఖిలప్రియ మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వంద కోట్ల విలువైన భూ వివాదం నేపథ్యంలో సోమవారం రాత్రి తెలంగాణ సీఎం కేసిఆర్ బంధువులైన మాజీ హాపీ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్, ఆయన ఇద్దరు సోదరులను ఐటి అధికారుల పేరుతో రాయలసీమ ముఠా సభ్యులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
కిడ్నాప్ చేసిన అనంతరం వారితో పలు పేపర్లపై సంతకాలు చేసుకుని వదిలివేశారు. ఈ కేసులో ఇప్పటికే కిడ్నాప్ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు మరో 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుండి రాబట్టిన సమాచారంతో ఏపి మాజీ మంత్రి అఖిలప్రియను బోయిన్ పల్లికి పోలీసులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.