ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది . ఒకే ఒక్క రోజు లో లోకల్ వారి నుంచి 161 కేసులు – ఫారెన్ , ఇతర రాష్ట్రాలతో కలుపుకుని మొత్తం 210 కేసులు రాగా.
ఇప్పటివరకూ ఏ రోజూ ఇన్ని కేసులు రాలేదు .. మొత్తం కేసుల సంఖ్య 3588 కి చేరుకోగా 2323 మంది డిశ్చార్జ్ అవ్వగా 73 మంది మరణించారు. ప్రస్తుతం 1192 మంది ఆసుపత్రి లో కోలుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా ఫారిన్ నుంచి వచ్చినవారి సంఖ్య ఎక్కువ ఉండడం , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం కేసులు 741 అవ్వడం తో కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 12771 టెస్ట్ లు చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దాదాపు నాలుగు లక్షల పైనే మొత్తం టెస్టుల సంఖ్య గా చెబుతోంది. దేశం లోనే ఇది కొత్త రికార్డు . కరోనా విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు , చేస్తున్న టెస్ట్ ల గురించి నేషనల్ మీడియా లో సైతం డిస్కషన్ లు జరుగుతున్నాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.