కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితుల వల్ల ఇప్పటికే అన్నీ వర్గాల జనాలూ ఎంతోకొంత నష్టపోతూనే ఉన్నారు. ఈ నేపధ్యం లో అందరికీ అండగా ఉండే ప్రయత్నం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
రైతులని , చిన్న – మధ్య తరహా పరిశ్రమ లనీ ఆదుకోవడం కోసం చర్యలు చేపట్టినట్లు కేంద్రం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్ మంత్రి ప్రకాశ్ జవాడేకర్ చేసిన సరికొత్త ప్రకటన ఆసక్తికరంగా ఉంది. MSME ల కోసం యాభై వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు మంత్రి తెలియజేశారు. దాని వలన ఆరో కోట్ల MSME లు ప్రయోజనం పొందుతాయి అన్నారు ఆయన. దాంతో పాటు వీధి వ్యాపారులకోసం 10వేల వరకూ లోన్స్ రూపం లో ఇవ్వబోతున్నట్టు ఆయన ప్రకటన చేసారు.