Breaking: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం బాతువా సమీపంలో సాంకేతిక లోపంతో గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. దీంతో కొంత మంది ప్రయాణీకులు కిందకు దిగారు. అదే సమయంలో మరో ట్రాక్ పై వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ కిందకు దిగిన ప్రయాణీకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking: సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంతి
శ్రీకాకుళం రైలు ప్రమాధ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అదికారులను సూచించారు సీఎం జగన్.