ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి డిల్లీ పర్యటన ప్రస్తుతానికి క్యాన్సిల్ అయ్యింది. నిన్ననే ఫిక్స్ ఐన షెడ్యూల్ ఒక్కసారిగా మారింది .
హోం మంత్రి అమిత్ షా వేరే అర్జెంట్ పనిమీద వెళుతూ ఉండడం తో జగన్ టూర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. జగన్ డిల్లీ వెళ్ళడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా , లేక ఆయన ముఖ్యమంత్రి హోదా లో నిధుల కోసం వెళుతున్నారా అనే విషయం మీద డిస్కషన్ లు జరుగుతున్న తరుణం లో ఈ న్యూస్ వాడి వేడి గా బయటకి వచ్చింది. చాలా నెలల గ్యాప్ తరవాత జగన్ డిల్లీ వెళుతూ ఉండడం తో రాజకీయ వ్యవహారాల తో పాటు కోవిడ్ గురించి కూడా మాట్లాడతారు అని అందరూ ఆశించారు. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన మాత్రమే కాకుండా , ఏపీ పునర్విభజన చట్టం తో పాటు అనేక విషయాల మీద జగన్ డిల్లీ లో మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?