BREAKING: సింగర్ సిద్ శ్రీరామ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే.. తన పాటలతో ఇప్పటికే చాలా పాపులర్ అయ్యారు. ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను తన శ్రావ్యకంఠంస్వర పాటలతో మెప్పించారు. ఇటీవల కాలంలో ఆయన పాడిన ప్రతి పాటా ఓ సెన్షేషనే. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటూ..ఆయా చిత్రాలకు కావాల్సినంత ప్రచారం కల్పిస్తున్నారు. ప్రధానంగా శ్రీరామ్ పాడిన మెలోడీ గీతాలకు యువతలో మంచి క్రేజ్ వచ్చింది. సిద్ శ్రీరామ్ సింగర్ గా మొదటి సారి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి అనే మువీతో పరిచయం అయ్యారు.
Read More: Janasena: ఆ జిల్లా మొత్తం క్లీన్ స్పీప్ చేయడానికి పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్..?
BREAKING: హీరోగా యువ గాయకుడు సిద్ శ్రీరామ్
ఇప్పుడు ఈ యువ గాయకుడు హీరోగా కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారు. మణిరత్నం దర్శకత్వంల వస్తున్న ఒక సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్ నుండి సమాచారం అందుతోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తి అయ్యాయనీ, స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా నటించేందుకు శ్రీరామ్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సింగర్ గా ఎందరినో ఆకట్టుకున్న సిద్ శ్రీరామ్ హీరోగా ప్రేక్షకులను మెప్పించగలరో లేదో చూడాలి మరి. కాగా ఈ మువీకి మణిరత్నం దర్శకత్వం చేస్తారా లేక నిర్మాతగా వ్యవహరించనున్నారా అనేది ఇంకా తేలలేదుట.