Breaking: ఈ నెల 11న (శుక్రవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఏపి కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో శుక్రవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రిమండలి అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శాసనససభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Breaking: బడ్జెట్ ఆమోదం కొరకు
ఈ సమావేశాల ప్రారంభం రోజునే కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు 30 కి పైగా అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదించింది. శుక్రవారం అసెంబ్లీలో 2022 – 23 సంవత్సరాలకు గానూ సాధారణ బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టనున్నందున ఆ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అనంతరం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Read More: AP CM YS Jagan: మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి ఇదే సాక్షం..