Breaking: ప్రముఖ కవి, రచయిత అయినటువంటి ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగులో సాహిత్యంలో 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను దీనికి ఎంపిక చేశారు. “వల్లంకి తాళం” అనే సాహిత్యానికి గాను ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా గోరటి వెంకన్నను పలువురు అభినందించారు. ఇకపోతే గోరేటి వెంకన్న ప్రజాకవిగా గొప్ప పేరు పొందిన జానపద గాయకుడు మరియు రచయిత. ప్రజల పరిస్థితులను, ప్రభుత్వాల పనితీరును దృష్టిలో పెట్టుకొని పాటలు పాడటం మరియు రచనలు చేస్తారు.
ఈయన పాడే పాటలో “గల్లీ చిన్నది గరిబోల్ల కథా పెద్దది” అనే పాట పేదవారి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈయన 1963, గౌరారం నాగర్ కర్నూల్ జిల్లాలో జన్మించారు. తండ్రి నర్సింహ మరియు తల్లి ఈరమ్మ, అలాగే ఈయనకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఇతనికి చిన్నతనం నుంచే పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. కానీ సినిమా పాటలు మాత్రం అస్సలు ఇష్ట పడే వాడు కాదు.
Pawan Balakrishna: పొలిటికల్ సబ్జెక్ట్ తో పవన్ తో బాలకృష్ణ డైరెక్టర్..??
ఈయన పాడిన పాట అయినటువంటి “రాజ్యహింస పెరుగుతున్నదో.. పేదల నెత్తురు ఏరులై పారుతూన్నదో..” అనే పాటను , ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్ విన్నారు. శంకర్ గారు వెంకన్నను సినిమా లో పాటలు పాడమని అడిగితే , దానికి వెంకన్న “సినిమా వల్ల ప్రజలకు, సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండవని!” చెప్పి తిరస్కరించాడు. కానీ చివరకు తన మిత్రుడైన సహు అందించిన ట్యూన్ తో “జైబోలో జైబోలో అమరవీరులకు జైబోలో” అనే పాట పాడాడు. ఈ పాట మంచి హిట్ అయ్యింది.