Breaking: కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై అనుచిత కామెంట్స్ చేయడంతో నిరసనలు చెలరేగాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఇండియాకు స్వాతంత్రం వచ్చిన ఏడాదిని సీఎం మర్చిపోయారని రాణే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీంతో పేద్ద రాజకీయ దుమారం రేగింది. సీఎంకు ఇండిపెండెన్స్ డే ఏరోజు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటని, ఆ టైంలో తాను అక్కడుంటే బాగా కొట్టేసేవాడినని రాణే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్లకు శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేన ఫిర్యాదుతో రాణేపై చతుర్ శృంగి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. నాసిక్ పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేసి ఆయనపై అరెస్ట్ వారెంజ్ ను జారీ చేశారు. దీంతో కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.