ప్రముఖ చైనా యాప్ టిక్ టాక్ సహా 59 యాప్ ల భారత ప్రభుత్వం కొరడా విదిలించిన సంగతి తెల్సిందే. ఈ యాప్ ల బ్యాన్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చైనా అవలంబిస్తున్న విధివిధానాల నేపథ్యంలో ఇది సరైన నిర్ణయమే అని అందరూ భావిస్తున్నారు.
అయితే భారత్ లోనే ఎక్కువ మార్కెట్ కలిగిన టిక్ టాక్ యాజమాన్యం ఈ విషయంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. యూఎస్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మైక్ పాంపీ మాట్లాడుతూ భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, జాతీయ భద్రతను ఈ టిక్ టాక్ సహా 59 యాప్ ల బ్యాన్ నిర్ణయం పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?