BREAKING: తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు భారత రాజధాని ఢిల్లీకి తరచూ వెళ్లి వస్తున్నారు. అటు కేసీఆర్, ఇటు జగన్ ఆయా పనుల మీద ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లారు. తాజాగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పవన్ కల్యాణ్ ను ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు.
COSTLY COTTAGE: అయ్య బాబోయ్: ఆ కాటేజ్ కోసం అన్ని కోట్లా.. స్పెషల్ ఏంటి..?!
దాంతో పవన్ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.అయితే, పవన్ కల్యాణ్ రాజధాని పర్యటన వెనుక ఏదైనా రాజకీయ ఆంతర్యం ఉందా? భాజపా నేతలతో ఆయన ఏ అంశాల గురించి మాట్లాడి ఉంటారు? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.
AP High Court: ఏపి సర్కార్ పై మరో సారి మండిపడిన హైకోర్టు..! ఎందుకంటే..?