Breaking:గత కొద్ది రోజులుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అనుమానం ఉన్న టాలీవుడ్ సినీ నటులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్ ని అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పూరి జగన్నాథ్, తరుణ్ లకు గుడ్ న్యూస్ చెప్పింది.
Breaking: బిగ్బాస్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. షోలో ఎంట్రీ ఇవ్వనున్న రామ్ చరణ్..!?
2017వ సంవత్సరం లో వీరిద్దరూ ఇచ్చిన రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది. అలాగే వారిద్దరికీ క్లీన్ చీట్ సమర్పించింది. అన్ని పరీక్షలను చేసిన తర్వాత ఆ నివేదికను ఎక్సైజ్ శాఖకు సమర్పించింది. దాంతో ఎక్సైజ్ శాఖ ఈ వివరాలను చార్జిషీటులో పొందుపరిచి సంబంధిత కోర్టుకు అందించింది.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సత్తా చాటిన నటరాజ్ మాస్టర్, ప్రియా..!!