జూబ్లీహిల్స్ లో నమోదైన ఒక కేసు విషయమై నోటీసులు ఇచ్చేందుకు వైసీపీ నేత పివిపి ఇంటికి వెళ్ళిన అధికారులపై కుక్కల్ని వదిలిన ఆయన ఆ తర్వాత విజయవాడ కు చేరుకున్నారట. అయితే డ్యూటీలో ఉన్న పోలీసులపై కుక్కలను వదలడమే కాకుండా హైదరాబాద్ నుండి పోలీసులకు దొరక్కుండా విజయవాడ పారిపోయాడని ఆయన పై ఆరోపణలు ఉన్నాయి.
ఇక విధినిర్వహణలో ఉన్న బంజారాహిల్స్ పోలీసుల పైకి కుక్కలని వదిలిన పివిపి ఎవరికీ దొరకకుండా విజయవాడలో తిరుగుతున్నారని… బంజారా హిల్స్ నుండి మూడు పోలీసు టీం లో అతనిని పట్టుకునేందుకు విజయవాడ కు వచ్చారు. అతని సన్నిహితులు స్నేహితులు మరియు బంధువులు వారు ఒక కన్నేసి ఉంచారు.
బంజారాహిల్స్ ఎస్సై ఫిర్యాదుతో ఇప్పుడు పివిపి పైన కొత్త కేసు నమోదు చేశారు. ఇక సాయంత్రం లోపు పివిపి ను పట్టుకొని విజయవాడ నుండి హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని వారు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే భూతగాదాలు కేసులో బెయిల్ తెచ్చుకున్న పివిపి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నందున అతను వారికి కనుక దొరికితే ఖచ్చితంగా తన బెయిల్ రద్దయ్యే చాన్సులు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు.