వైకాపా అధినేతపై మాటల్లో ప్రేమ,చేతల్లో కోపం చూపిస్తున్నారని బలంగా నమ్మిన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రవర్తనను ఖండించగా, రఘురామకృష్ణం రాజు ప్రవర్తన, మాటతీరు ఏమాత్రం నచ్చని కొందరు కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫ్లెక్సీలను టమాటాలు, కోడిగుడ్లతో కొట్టారు.
ఇది రాష్ట్రవ్యాప్తంగా మరి ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో వైసీపీనేతలు, కార్యకర్తలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం ఇంకో వివాదానికి దారితీసింది.
దిష్టి బొమ్మలు దహనం చేసి.. తనను కించపరుస్తూ మాట్లాడారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆయన… నియోజకవర్గంలో పర్యటిస్తేదాడులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. దీంతో కార్యకర్తలు ఆన్ లైన్ వేదికగా కామెంట్లు మొదలెట్టేశారు! రెండు వారాలముందు పార్టీలో చేరి బీ ఫారం తెచ్చుకున్నా కూడా నెత్తినపెట్టుకుని ఎంపీని చేశామని.. ఆ కృతజ్ఞత లేకుండా తమపై కేసులు పెట్టారని వారు కామెంట్లు చేస్తున్నారు !
దీంతో.. అటు అధినేతనూ పరోక్షంగా కాదని, ఇటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను కాదనుకుని.. ఆఖరికి పార్టీకి వెన్నెముఖ లాంటి కార్యకర్తలపై కూడా కేసులు పెట్టి.. ఏమి సాదిద్దామని ఆయన అనుకుంటున్నారని చర్చలు మొదలయ్యాయి.ఇలా అధినేత ,పార్టీ ప్రజాప్రతినిధులు, చివరకు కార్యకర్తల ఆగ్రహానికి గురైన రఘురామకృష్ణంరాజు ఇక లాభం లేదనుకొని ఢిల్లీకి బయలుదేరిపోయారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?