BREAKING: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ మెరవనుంది.
కాగా తాజాగా ఈ సినిమా లాంచింగ్ వేళ ఒక ఆకట్టుకునే ఫస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో చెర్రీ, కియారా, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు కనిపించారు. అలాగే ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న సునీల్ తో సహా అందరు టెక్నీషియన్లు బ్లాక్ సూట్స్ ధరించి కనిపించారు. వీ ఆర్ కమింగ్ అనే ప్రకటనతో విడుదలైన ఈ పోస్టర్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. పోస్టర్ అదిరిపోయిందని అభిమానులు తెగ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ తమన్ సంగీత బాణీలు అందిస్తున్నారు.
TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏమిటంటే!