BREAKING: దిగ్గజ కథానాయిక, అక్కినేని నాగచైతన్య సతీమణి సమంత విడాకులపై అనేక రూమర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కినేని సమంత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు వస్తుండగా విలేకరులు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. ఒక విలేకరి మాత్రం మీ విడాకులపై రూమర్స్ వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. అయితే సమంతా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. గుడి కి వచ్చి… బుద్ధుందా అని ఆ విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం సమంత రిప్లే హాట్ టాపిక్ గా మారింది.