ప్రముఖ టాలివుడ్ గాయని సునీత పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్న చైతన్య ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తన మేనల్లుడు అని చెప్పి సెలబ్రెటీలతో పరిచయాలు పెంచుకుంటూ అమాయకులకు అవకాశాలకు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని నాకు ఈ మధ్యే తెలిసింది అని సునీత పేర్కొంది.
తాను అది విని షాక్ అయ్యానని అసలు తనకు ఎటువంటి మేనల్లుడు లేనే లేడు అని కన్ఫర్మ్ చేసింది. ఇక సైబర్ క్రైం సునీత వీడియో మెసేజ్ ద్వారా చేసిఅన్ ఆరోపణ మీద పోలీసులు చైతన్య పైన కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.
ఇంకా చైతన్య వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా సింగర్ సునీత పేరు చెప్పి ఇటువంటి మోసాలు చేస్తున్నవారు ఇటీవల ఎక్కువైపోయారు. ఎవరైనా ఏదైనా చెబితే కాస్త ఆలోచించి అడుగువేయండి.. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు అని సునీత హెచ్చరించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?