గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లో అమరావతి దీక్ష శిబిరంపై రాళ్ల దాడి జరిగింది. అమరావతి కోసం దీక్ష చేస్తున్న వారు చెప్పినదాని ప్రకారం మూడు రాజధానులు మద్దతుగా దీక్ష చేస్తున్న వ్యక్తులు వారిపై రాళ్ల దాడికి పాల్పడ్డారని అన్నారు.
గ్రామంలో ఇంటింటికి అమరావతి కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలను దీక్ష శిబిరానికి చెందిన వారు అడ్డుకున్నారు ఇక ఈ క్రమంలో మహిళలపై దాడులు జరిగినట్లు కూడా తెలిపారు.
ఇద్దరు మహిళలకు స్వల్పంగా గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు శిబిరం వద్దకు చేరుకున్నారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మూడు రాజధానులు అడ్డుకున్నారు గ్రామంలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక ఇరు వర్గాల మధ్య అది తీవ్రం కాకుండా పోలీసులు మోహరించారు.