NewsOrbit
న్యూస్

Breaking: పంజాబ్ పీసీపీ మాజీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్టు

Breaking: దాదాపు 30ఏళ్ల క్రితం నాటి కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 1988 డిసెంబర్ 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేటు క్రాసింగ్ వద్ద సిద్దూకు, గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. ఆ ఘర్షణలో గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్దు నేరస్తుడు అనడానికి తగిన ఆధారాలు ఏమీ లేవన్న కారణంతో 2018 మే నెలలో సుప్రీం కోర్టు ఆయనను నిర్ధోషిగా పేర్కొంది. కేవలం వెయ్యి రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం. మరో సారి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం ధర్మాసనం మరో సారి సిద్ధూ కేసును విచారణ జరిపింది. ఈ కేసులో ఆయనను నేరస్థుడిగా పరిగణించిన సుప్రీం కోర్టు .. ఏడాది జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Breaking: Supreme court sentenced Congress leader Navjot Singh Sidhu
Breaking Supreme court sentenced Congress leader Navjot Singh Sidhu

Breaking: మూడు దశాబ్దాల తరువాత

కేసు పూర్వాపరాలు ఏమిటంటే.. 1988 డిసెంబర్ 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేట్ క్రాసింగ్ సిద్దూ తన జిప్సీని పార్క్ చేసి స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లిన గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడు రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న జిప్సీని పక్కకు తీయాలని సిద్ధూను కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ ఘర్షణలో గాయాలపాలైన గుర్నామ్ సింగ్ తరువాత ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై బాధితుడి బంధువులు ఫిర్యాదుతో సిద్దు, అతని స్నేహితుడు నంధూపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన ట్రయిల్ కోర్టు 1999 సెప్టెంబర్ నెలలో సిద్ధూను, అతని స్నేహితుడు నంధూను నిర్ధోషులుగా తీర్పు ఇచ్చింది. ట్రయిల్ కోర్టును బాధితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు ట్రయిల్ కోర్టు తీర్పును పక్కకు పెట్టింది.

తొలుత వెయి రూపాయలు జరిమానా… ఇప్పుడు ఏడాది జైలు

దీనిపై సిద్ధూ అతని స్నేహితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2007లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సిద్దుకు సెక్షన్ 323 కింద వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సిద్ధుకు కేవలం వెయ్యి రూపాయల జరిమామా మాత్రమే విధిస్తూ తీర్పు రావడంపై బాధిత కుటుంబం అభ్యంతరం తెలియజేస్తూ సుప్రీం కోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, ఎస్‌కే కౌలు నేతృత్వంలోని ధర్మాసనం..వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju