Breaking: తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ బుధవారం ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారులు అన్నీ సిద్ధం చేశారు. కరోనా కారణంగా చాలా సార్లు ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియను పొడగిస్తూ వచ్చారు. ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను పకడ్బందీగా నిర్వహించింది. దీంతో తాజాగా పరీక్షా ఫలితాలను రిలీజ్ చేసేందుకు అన్ని చర్యలనూ తీసుకుంది.
Big Boss: ప్రజెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఎక్కడ ఉన్నారో తెలుసా..??
కాకపోతే ఈ సారి కొన్ని ముఖ్యమైన మార్పులను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రద్దు అయిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్ను ఎత్తివేస్తూ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ సీటు కోసం ఇంటర్ లో 45 శాతం మార్కులు తప్పని సరిగా సాధించాలనే నిబంధనను కూడా ఎత్తేసింది. దీంతో ఎంసెట్లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్కు అర్హులని అధికారులు వెల్లడించారు. తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
Breaking: కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..!