Breaking: కర్నూలు జిల్లా హోలగుందలో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీస్ స్టేషన్ ముందే ఈ రోజు ఇరువర్గాలు మోహరించాయి. అక్కడే ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కర్నూలు ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదనపు పోలీసుల బలగాలతో హోలగుందలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందకు చేరుకుని శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణపై ఆరా తీశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కొనసాగిస్తున్నారు.