BREAKING:సాధారణంగా భార్యాభర్తలు చిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. అయితే రక్తాలు కారేంతగా భార్యభర్తలు కొట్టుకున్నారంటే.. దాని వెనక ఏదో ఒక పెద్ద కారణమే ఉంటుంది. కానీ ఒక భార్య తన కూరకు వంక పెట్టాడనే కారణంతో కట్టుకున్న భర్త తలను పగల కొట్టింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దినేష్, బిందియా అనే దంపతులు హిస్సార్ లో నివసిస్తున్నారు. ఈరోజు లాగానే బిందియా వంట రెడీ చేసింది.
అయితే దినేష్ మాత్రం కూర సరిగా ఉండలేదని.. ఉప్పు బాగా ఎక్కువైంది అని వంక పెట్టాడు. దాంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన బిందియా భర్త పై దాడికి దిగింది. తాను చేసిన కూర నీకు నచ్చలేదా అంటూ భర్తపై ఇనుపరాడ్ తో తలపై ఒక్కటి పీకింది. దాంతో తీవ్ర గాయాలపాలైన సదరు భర్త పోలీస్ స్టేషన్ కి వెళ్లి భార్య పై ఫిర్యాదు చేశాడు. కాగా ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.