BREAKING: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నుంచి కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైనప్పటికీ.. కొన్ని స్కూల్ లకు మాత్రం ప్రత్యక్ష తరగతులకు అనుమతి లభించలేదు. ప్రభుత్వ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల తో పాటు హాస్టల్స్ ఆధారంగా నడిచే అన్ని పాఠశాలలకు కూడా ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇవ్వలేదు. ఈ పాఠశాలల్లో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమైనప్పటికీ.. ఈ 4 లక్షల మంది విద్యార్థులు మాత్రం పాఠశాలలకు వెళ్లక్కర్లేదు. వీరంతా కూడా ఆన్లైన్ క్లాసులకే అటెండ్ కావాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాస్ లతోపాటు టీవీల ద్వారా కూడా పాఠాలు యథాతథంగా కొనసాగుతాయని విద్యాశాఖ వివరించింది.
Breaking: రిటైర్మెంట్ ప్రకటించిన డేల్ స్టెయిన్..!!